కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
Sthanikam District Staff Reporter
-రైతుల ప్రయోజనాలపై రాజకీయాలు ఆపాలి’ – సట్టు తిరుమలేష్
కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రభుత్వం చేపట్టిన చర్యలకు హైకోర్టు స్టే విధించడంతో రాజకీయ కక్షసాధింపుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని బీఆర్ఎస్ నాయకుడు సట్టు తిరుమలేష్ అన్నారు.ఘోష్ కమిషన్ నివేదికపై కోర్టు జోక్యం చేసుకోవడం ద్వారా చట్ట పరిరక్షణ మరోసారి స్పష్టమైందన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం తగదని సూచించారు.భారత రాజ్యాంగం, చట్టాలు ప్రజలకు రక్షణ కవచమని,హైకోర్టు తీర్పు వాటి ప్రాముఖ్యతను మరోసారి తెలియజేసిందన్నారు. కేసీఆర్ పాలనలో ఎటువంటి తప్పు జరగలేదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండటానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. భువనగిరి, ఆలేరు,తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి భూములను సస్యశ్యామలం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.“తెలంగాణ జీవాధారం కాళేశ్వరమే” అని సట్టు తిరుమలేష్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సందిల భాస్కర్ గౌడ్,గుంటి మధుసూదన్ రెడ్డి,ఎర్రగోకుల జశ్వంత్,పల్లె సంతోష్ గౌడ్,కాకల్ల ఉపేందర్,మర్ల నాగరాజు,చెరుకు కనకయ్య,పంబ కర్ణాకర్,బొంగోని ఉపలయ్య,నాగిర్తి గోపాల్ రెడ్డి,యమ్మ భాస్కర్,పాండవుల భిక్షపతి,అశోక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి