Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:07 PM

కల్తీ కల్లు వ్యాపారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఏఐవైఎఫ్

కల్తీ కల్లు వ్యాపారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఏఐవైఎఫ్

కల్తీ కల్లు వ్యాపారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఏఐవైఎఫ్
April 24, 2026 02:50 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న కల్తీ కల్లు అక్రమ వ్యాపారంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అనంతరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్, పట్టణ కార్యదర్శి టీ. వీరేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి కల్లును తీసుకువచ్చి రహస్య ప్రదేశాల్లో నిల్వచేసి, అందులో రసాయనాలు కలిపి మత్తు పెంచి పట్టణంలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం సేవించడం వల్ల ముఖ్యంగా కూలీలు, పేద ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కాలేయం, కిడ్నీలకు హానికర ప్రభావాలు ఉన్నప్పటికీ సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి కల్తీ కల్లు తయారీ కేంద్రాలను గుర్తించి మూసివేయాలని, అక్రమ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే ప్రజలకు కల్తీ మద్యం ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు కే. రమేష్, కార్యదర్శి జి. అంజిత్ గౌడ్, కే. లింగప్ప, సిపిఐ మండల కార్యదర్శులు ఎల్లప్ప, సత్యనారాయణ, డీహెచ్‌పీఎస్ నియోజకవర్గ కార్యదర్శి విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు పుష్పరాజ్, బుజ్జి లింగప్ప, ఇతర సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News