జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట
జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట
Editor Desk
తుర్కపల్లి: మండలంలోని జేతురం తండా గ్రామపంచాయతీలో నూతన రేషన్ షాప్ను సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ములకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రేషన్ బియ్యం తీసుకోవాల్సి వచ్చేదని, జేతురం తండా, సంగ్య తండా, మామిడి కుంట తండా ప్రజలు దూరం వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకెళ్లగా కొత్త రేషన్ షాప్ మంజూరు అయిందన్నారు.
ఈ షాప్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు సులభంగా రేషన్ అందుబాటులోకి వచ్చిందని, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రతిభ రాజేష్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మీట్య నాయక్, లలిత దేవేందర్ నాయక్, రేషన్ డీలర్ సర్వర్ నాయక్, వార్డు సభ్యులు బద్రు నాయక్, బద్రిబాయి, భాస్కర్, సందర్ నాయక్, దాసు నాయక్, రమేష్, శంకర్, సుమన్, పవన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి