Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:30 AM

జీపీఓలకు మొబైల్ యాప్‌లు

జీపీఓలకు మొబైల్ యాప్‌లు

జీపీఓలకు మొబైల్ యాప్‌లు
February 24, 2026 09:53 PM 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పౌరసేవల విచారణ ఇక కాగితరహితం

పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గ్రామ పాలనాధికారులు (జీపీఓ) కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై పౌరసేవల దరఖాస్తుల స్వీకరణ నుంచి విచారణ, నివేదికల సమర్పణ వరకూ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే కొనసాగనుంది.

రెవెన్యూ సిబ్బంది స్థల పరిశీలన వివరాలు, సిఫారసులు, నివేదికలు నేరుగా యాప్‌లో నమోదు చేయడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది. కాగిత వినియోగం పూర్తిగా తగ్గించి, డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత కొంతకాలంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్‌ను అమలు చేశారు. యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు సమీక్షించి, సాంకేతికంగా తలెత్తిన సమస్యలను గుర్తించి సవరణలు చేపట్టారు. అన్ని అడ్డంకులు అధిగమించిన తర్వాత పూర్తి స్థాయి అప్లికేషన్‌ను నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జీపీఓలకు అందుబాటులోకి తెచ్చారు.

ఈ సందర్భంగా జీపీఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, జగన్ మోహన్ ప్రసాద్, కలెక్టరేట్ పరిపాలనాధికారి (మీసేవ) సాయి కుమార్, ఈ–జిల్లా మేనేజర్‌తో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News