జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు
జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు
Editor Desk
కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు డ్యాన్సులతో సందడి చేశారు.
స్థానిక వార్డు సభ్యుడు పెండ్ర అంజయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని, ఇష్టపడి చదవడం, గురువులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.
అనంతరం నూరుశాతం హాజరు నమోదుచేసిన విద్యార్థులకు పెండ్ర అంజయ్య ప్రోత్సాహక నగదు అందించారు. ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి