Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 PM

జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు

జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు

 జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు
10-03-2026 306 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు డ్యాన్సులతో సందడి చేశారు.

స్థానిక వార్డు సభ్యుడు పెండ్ర అంజయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని, ఇష్టపడి చదవడం, గురువులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

అనంతరం నూరుశాతం హాజరు నమోదుచేసిన విద్యార్థులకు పెండ్ర అంజయ్య ప్రోత్సాహక నగదు అందించారు. ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు

Article Image

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు డ్యాన్సులతో సందడి చేశారు.

స్థానిక వార్డు సభ్యుడు పెండ్ర అంజయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని, ఇష్టపడి చదవడం, గురువులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

అనంతరం నూరుశాతం హాజరు నమోదుచేసిన విద్యార్థులకు పెండ్ర అంజయ్య ప్రోత్సాహక నగదు అందించారు. ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News