Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:59 PM

జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు

జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు

 జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు
March 10, 2026 06:01 PM 301 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు డ్యాన్సులతో సందడి చేశారు.

స్థానిక వార్డు సభ్యుడు పెండ్ర అంజయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని, ఇష్టపడి చదవడం, గురువులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

అనంతరం నూరుశాతం హాజరు నమోదుచేసిన విద్యార్థులకు పెండ్ర అంజయ్య ప్రోత్సాహక నగదు అందించారు. ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News