జావిద్ మృతి పట్ల నివాళులు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల సంతాపం
జావిద్ మృతి పట్ల నివాళులు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల సంతాపం
Editor Desk
భువనగిరి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యుడు మహమ్మద్ జావిద్ ఆకస్మిక మృతి పట్ల భువనగిరి జిల్లా కేంద్రంలో నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద సేవాదళ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అతహర్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాట్లాడుతూ జావిద్ పార్టీ కష్టకాలంలో కీలక పాత్ర పోషించిన నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ స్థాయికి చేరుకున్న జావిద్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి