Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:28 PM

జావిద్ మృతి పట్ల నివాళులు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల సంతాపం

జావిద్ మృతి పట్ల నివాళులు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల సంతాపం

జావిద్ మృతి పట్ల నివాళులు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల సంతాపం
16-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యుడు మహమ్మద్ జావిద్ ఆకస్మిక మృతి పట్ల భువనగిరి జిల్లా కేంద్రంలో నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద సేవాదళ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అతహర్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాట్లాడుతూ జావిద్ పార్టీ కష్టకాలంలో కీలక పాత్ర పోషించిన నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ స్థాయికి చేరుకున్న జావిద్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

జావిద్ మృతి పట్ల నివాళులు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల సంతాపం

Article Image

భువనగిరి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యుడు మహమ్మద్ జావిద్ ఆకస్మిక మృతి పట్ల భువనగిరి జిల్లా కేంద్రంలో నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద సేవాదళ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అతహర్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాట్లాడుతూ జావిద్ పార్టీ కష్టకాలంలో కీలక పాత్ర పోషించిన నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ స్థాయికి చేరుకున్న జావిద్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News