Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 25, 2026 07:42 PM

జనంపల్లిలో శాంతమ్మకు నాగం వర్షిత్ రెడ్డి నివాళి

జనంపల్లిలో శాంతమ్మకు నాగం వర్షిత్ రెడ్డి నివాళి

జనంపల్లిలో శాంతమ్మకు నాగం వర్షిత్ రెడ్డి నివాళి
February 25, 2026 06:11 PM 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

కార్యకర్తకు ఆపన్నహస్తం… దుఃఖంలో ధైర్యం చెప్పిన నాయకత్వం

రామన్నపేట: మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు తల్లి అక్కెనపల్లి శాంతమ్మ మరణ వార్త తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. శాంతమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ… పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి, వార్డు సభ్యులు సుర్వి హరిబాబు, యాదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై శాంతమ్మకు నివాళులు అర్పించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News