Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:10 AM

జనగణనలో భాగస్వామ్యం కావాలి.కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.

జనగణనలో భాగస్వామ్యం కావాలి.కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.

జనగణనలో భాగస్వామ్యం కావాలి.కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.
26-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణలో 2027 జనాభా లెక్కల స్వీయ గణన ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశ అభివృద్ధికి జనాభా లెక్కలు పునాది రాయిగా ఉంటాయని పేర్కొన్నారు. సమగ్ర గణాంకాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించడం ద్వారా సమాన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఖచ్చితమైన సమాచారం సేకరణ ద్వారా సుపరిపాలన మరింత బలపడుతుందని అన్నారు.

ఆధునిక డిజిటల్ సాంకేతికత వినియోగంతో 2027 జనగణన ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని మంత్రి వివరించారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం ఉంటుందని, అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహనకు ఈ జనాభా లెక్కలు దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ఖచ్చితమైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

జనగణన డైరెక్టరేట్ సంచాలకులు భారతి హోళికేరి మాట్లాడుతూ… అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వీయ గణన పూర్తి చేయవచ్చని తెలిపారు. సమర్పించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. వివరాలు నమోదు చేసిన వెంటనే ‘స్వీయ గణన ఐడీ’ లభిస్తుందని, అనంతరం ఎన్యూమరేటర్ ధృవీకరిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జనగణనలో భాగస్వామ్యం కావాలి.కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.

Article Image

తెలంగాణలో 2027 జనాభా లెక్కల స్వీయ గణన ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశ అభివృద్ధికి జనాభా లెక్కలు పునాది రాయిగా ఉంటాయని పేర్కొన్నారు. సమగ్ర గణాంకాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించడం ద్వారా సమాన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఖచ్చితమైన సమాచారం సేకరణ ద్వారా సుపరిపాలన మరింత బలపడుతుందని అన్నారు.

ఆధునిక డిజిటల్ సాంకేతికత వినియోగంతో 2027 జనగణన ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని మంత్రి వివరించారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం ఉంటుందని, అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహనకు ఈ జనాభా లెక్కలు దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ఖచ్చితమైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

జనగణన డైరెక్టరేట్ సంచాలకులు భారతి హోళికేరి మాట్లాడుతూ… అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వీయ గణన పూర్తి చేయవచ్చని తెలిపారు. సమర్పించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. వివరాలు నమోదు చేసిన వెంటనే ‘స్వీయ గణన ఐడీ’ లభిస్తుందని, అనంతరం ఎన్యూమరేటర్ ధృవీకరిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News