* ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలి
* మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి
* సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్వీయ గణన' పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాంరెడ్డి సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయ పాత భవనంలోని సమావేశ మందిరంలో సెక్షన్ అధికారులు, రెగ్యులర్, అవుట్సోర్సింగ్, మెప్మా సిబ్బంది, బీఎల్వోలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఆన్లైన్లో వివరాల నమోదు:
మున్సిపల్ సిబ్బంది అంతా తమ కుటుంబ వివరాలను ముందుగా నమోదు చేసుకోవడమే కాకుండా, పట్టణ ప్రజలకు,తమబంధుమిత్రులకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించాలని కమిషనర్ కోరారు. స్వీయ గణన కాలపరిమితి: ఈ నెల 26 (ఆదివారం) నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. se.census.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి కుటుంబ వివరాలు పొందుపరచాలి.
ఎస్ఈ ఐడీ (SE ID): వివరాలు నమోదు చేసిన తర్వాత మొబైల్కు వచ్చే ఐడీ నంబర్ను భద్రపరుచుకోవాలి.ఎన్యూమరేటర్ల సందర్శన: మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు వారికి ఈ ఐడీ నంబర్ను చూపిస్తే సరిపోతుందని కమిషనర్ వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి