జనగణన ఖచ్చితత్వమే అభివృద్ధికి పునాది శిక్షణ.అదనపు కలెక్టర్ భాస్కర్రావు
జనగణన ఖచ్చితత్వమే అభివృద్ధికి పునాది శిక్షణ.అదనపు కలెక్టర్ భాస్కర్రావు
Editor Desk
భువనగిరి, : మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జనగణన–2027 శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. సమగ్రంగా, ఖచ్చితంగా డేటా సేకరణ చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.
ప్రతి ఇంటికి చేరుకుని సరైన సమాచారాన్ని నమోదు చేయడం అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. శిక్షణ ద్వారా ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందించబడినట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తే జనగణనను విజయవంతంగా పూర్తి చేయగలమన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి