జనాభా లెక్కల సేకరణలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం: తాహసిల్దార్ ఆంజనేయులు
జనాభా లెక్కల సేకరణలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం: తాహసిల్దార్ ఆంజనేయులు
Sthanikam District Staff Reporter
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం ముగింపులో తాహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలు ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్లకు పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.సర్వేను జాగ్రత్తగా నిర్వహిస్తే రాబోయే తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.జనాభా లెక్కల సేకరణ ద్వారా భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు అవసరమైన ముఖ్య సమాచారం లభిస్తుందని,అందువల్ల ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ,తమ ఇళ్లకు వచ్చిన సర్వే సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వాలని,అలా చేసినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు.ప్రతి ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన బ్లాకులు,మ్యాపులను ముందుగానే పరిశీలించి ఫీల్డ్లోకి వెళ్లాలని,గ్రామ స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు దూడల వెంకటేష్,తిరుపతి రెడ్డి,ఉపాధ్యాయులు దశమంత రెడ్డి,నాగేశ్వర్ రావు,లచ్చునాయక్,నరేష్,జ్యోతిర్మయి,జ్యోతి,నాగలక్ష్మి,ఏఎస్ఓ మహేష్,భవాని,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి