Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:34 PM

జనాభా లెక్కల సేకరణలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం: తాహసిల్దార్ ఆంజనేయులు

జనాభా లెక్కల సేకరణలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం: తాహసిల్దార్ ఆంజనేయులు

జనాభా లెక్కల సేకరణలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం: తాహసిల్దార్ ఆంజనేయులు
21-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం ముగింపులో తాహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలు ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్లకు పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.సర్వేను జాగ్రత్తగా నిర్వహిస్తే రాబోయే తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.జనాభా లెక్కల సేకరణ ద్వారా భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు అవసరమైన ముఖ్య సమాచారం లభిస్తుందని,అందువల్ల ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ,తమ ఇళ్లకు వచ్చిన సర్వే సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వాలని,అలా చేసినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు.ప్రతి ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన బ్లాకులు,మ్యాపులను ముందుగానే పరిశీలించి ఫీల్డ్‌లోకి వెళ్లాలని,గ్రామ స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు దూడల వెంకటేష్,తిరుపతి రెడ్డి,ఉపాధ్యాయులు దశమంత రెడ్డి,నాగేశ్వర్ రావు,లచ్చునాయక్,నరేష్,జ్యోతిర్మయి,జ్యోతి,నాగలక్ష్మి,ఏఎస్ఓ మహేష్,భవాని,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనాభా లెక్కల సేకరణలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం: తాహసిల్దార్ ఆంజనేయులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం ముగింపులో తాహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలు ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్లకు పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.సర్వేను జాగ్రత్తగా నిర్వహిస్తే రాబోయే తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.జనాభా లెక్కల సేకరణ ద్వారా భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు అవసరమైన ముఖ్య సమాచారం లభిస్తుందని,అందువల్ల ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ,తమ ఇళ్లకు వచ్చిన సర్వే సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వాలని,అలా చేసినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు.ప్రతి ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన బ్లాకులు,మ్యాపులను ముందుగానే పరిశీలించి ఫీల్డ్‌లోకి వెళ్లాలని,గ్రామ స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు దూడల వెంకటేష్,తిరుపతి రెడ్డి,ఉపాధ్యాయులు దశమంత రెడ్డి,నాగేశ్వర్ రావు,లచ్చునాయక్,నరేష్,జ్యోతిర్మయి,జ్యోతి,నాగలక్ష్మి,ఏఎస్ఓ మహేష్,భవాని,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News