PRINT TIME: April 12, 2026 10:20 PM
జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం
జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం
April 12, 2026 08:46 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కలిపి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలధార - నీటి నిర్వహణ” కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు. రొద్దం మండలం NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పార్టీలకు అతీతంగా అందరూ తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి