Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:54 PM

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం

జలధార కార్యక్రమంతో కలిపి గ్రామంలో నీటి సంరక్షణకు శ్రీకారం
April 12, 2026 08:46 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కలిపి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలధార - నీటి నిర్వహణ” కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు. రొద్దం మండలం NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పార్టీలకు అతీతంగా అందరూ తమ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News