Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:21 PM

“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి

“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి

“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి
April 10, 2026 07:31 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- భువనగిరి పట్టణంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవాలను కుల,మత భేదాలకు అతీతంగా ఘనంగా నిర్వహించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పిలుపునిచ్చారు.ఏప్రిల్ 14న జరగనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.శుక్రవారం భువనగిరి పట్టణంలోని వివిధ మసీదులో నమాజ్ అనంతరం భువనగిరి పట్టణంలోని పలు మసీదులను సందర్శించిన బర్రె జహంగీర్,ముస్లిం మైనారిటీ సోదరులతో ప్రత్యక్షంగా సమావేశమై పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 12న నిర్వహించనున్న మైనారిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సూచించారు.అదేవిధంగా,ఏప్రిల్ 14న నిర్వహించే అంబేద్కర్ ర్యాలీలో ముస్లిం మైనారిటీలు భారీగా పాల్గొని“జై మీమ్-జై భీమ్”నినాదాలతో విజయవంతం చేయాలని కోరారు.సమాజంలో పెరుగుతున్న మతతత్వ వాదాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇలియాస్ భాయ్,ఎండి.భురానుద్దీన్ కౌన్సిలర్,ఎస్ కె.బబ్లు,ముస్లిం మైనార్టీ నాయకులు అనీఫ్ మైమన్,ఇక్బాల్ చౌదరి,ఎండి.సుజాయిద్దీన్,షేక్ హమీద్ పాష,గఫూర్ బాయ్,ఖాజాం అమీర్ బాయ్,బండార్ రవివర్ధన్ బీరప్ప నరసింహ మాజీ కౌన్సిలర్ ఇటికల దేవేందర్,కుతాడి సురేష్,నాగారం శంకర్,మంద శివ,పులిగిల్ల బాలయ్య,ఐలాపురం బాబు,ఎండి భారీ,ఎండి.అమానతుల్లా,ఎడబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News