“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి
“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి
Sthanikam District Staff Reporter
- భువనగిరి పట్టణంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవాలను కుల,మత భేదాలకు అతీతంగా ఘనంగా నిర్వహించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పిలుపునిచ్చారు.ఏప్రిల్ 14న జరగనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.శుక్రవారం భువనగిరి పట్టణంలోని వివిధ మసీదులో నమాజ్ అనంతరం భువనగిరి పట్టణంలోని పలు మసీదులను సందర్శించిన బర్రె జహంగీర్,ముస్లిం మైనారిటీ సోదరులతో ప్రత్యక్షంగా సమావేశమై పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 12న నిర్వహించనున్న మైనారిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సూచించారు.అదేవిధంగా,ఏప్రిల్ 14న నిర్వహించే అంబేద్కర్ ర్యాలీలో ముస్లిం మైనారిటీలు భారీగా పాల్గొని“జై మీమ్-జై భీమ్”నినాదాలతో విజయవంతం చేయాలని కోరారు.సమాజంలో పెరుగుతున్న మతతత్వ వాదాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇలియాస్ భాయ్,ఎండి.భురానుద్దీన్ కౌన్సిలర్,ఎస్ కె.బబ్లు,ముస్లిం మైనార్టీ నాయకులు అనీఫ్ మైమన్,ఇక్బాల్ చౌదరి,ఎండి.సుజాయిద్దీన్,షేక్ హమీద్ పాష,గఫూర్ బాయ్,ఖాజాం అమీర్ బాయ్,బండార్ రవివర్ధన్ బీరప్ప నరసింహ మాజీ కౌన్సిలర్ ఇటికల దేవేందర్,కుతాడి సురేష్,నాగారం శంకర్,మంద శివ,పులిగిల్ల బాలయ్య,ఐలాపురం బాబు,ఎండి భారీ,ఎండి.అమానతుల్లా,ఎడబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి