Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:31 PM

“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి

“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి

“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి
10-04-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- భువనగిరి పట్టణంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవాలను కుల,మత భేదాలకు అతీతంగా ఘనంగా నిర్వహించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పిలుపునిచ్చారు.ఏప్రిల్ 14న జరగనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.శుక్రవారం భువనగిరి పట్టణంలోని వివిధ మసీదులో నమాజ్ అనంతరం భువనగిరి పట్టణంలోని పలు మసీదులను సందర్శించిన బర్రె జహంగీర్,ముస్లిం మైనారిటీ సోదరులతో ప్రత్యక్షంగా సమావేశమై పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 12న నిర్వహించనున్న మైనారిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సూచించారు.అదేవిధంగా,ఏప్రిల్ 14న నిర్వహించే అంబేద్కర్ ర్యాలీలో ముస్లిం మైనారిటీలు భారీగా పాల్గొని“జై మీమ్-జై భీమ్”నినాదాలతో విజయవంతం చేయాలని కోరారు.సమాజంలో పెరుగుతున్న మతతత్వ వాదాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇలియాస్ భాయ్,ఎండి.భురానుద్దీన్ కౌన్సిలర్,ఎస్ కె.బబ్లు,ముస్లిం మైనార్టీ నాయకులు అనీఫ్ మైమన్,ఇక్బాల్ చౌదరి,ఎండి.సుజాయిద్దీన్,షేక్ హమీద్ పాష,గఫూర్ బాయ్,ఖాజాం అమీర్ బాయ్,బండార్ రవివర్ధన్ బీరప్ప నరసింహ మాజీ కౌన్సిలర్ ఇటికల దేవేందర్,కుతాడి సురేష్,నాగారం శంకర్,మంద శివ,పులిగిల్ల బాలయ్య,ఐలాపురం బాబు,ఎండి భారీ,ఎండి.అమానతుల్లా,ఎడబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

“జై మీమ్-జై భీమ్”నినాదాలతో అంబేద్కర్ ర్యాలీని విజయవంతం చేయాలి

Article Image

- భువనగిరి పట్టణంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవాలను కుల,మత భేదాలకు అతీతంగా ఘనంగా నిర్వహించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పిలుపునిచ్చారు.ఏప్రిల్ 14న జరగనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.శుక్రవారం భువనగిరి పట్టణంలోని వివిధ మసీదులో నమాజ్ అనంతరం భువనగిరి పట్టణంలోని పలు మసీదులను సందర్శించిన బర్రె జహంగీర్,ముస్లిం మైనారిటీ సోదరులతో ప్రత్యక్షంగా సమావేశమై పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 12న నిర్వహించనున్న మైనారిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సూచించారు.అదేవిధంగా,ఏప్రిల్ 14న నిర్వహించే అంబేద్కర్ ర్యాలీలో ముస్లిం మైనారిటీలు భారీగా పాల్గొని“జై మీమ్-జై భీమ్”నినాదాలతో విజయవంతం చేయాలని కోరారు.సమాజంలో పెరుగుతున్న మతతత్వ వాదాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇలియాస్ భాయ్,ఎండి.భురానుద్దీన్ కౌన్సిలర్,ఎస్ కె.బబ్లు,ముస్లిం మైనార్టీ నాయకులు అనీఫ్ మైమన్,ఇక్బాల్ చౌదరి,ఎండి.సుజాయిద్దీన్,షేక్ హమీద్ పాష,గఫూర్ బాయ్,ఖాజాం అమీర్ బాయ్,బండార్ రవివర్ధన్ బీరప్ప నరసింహ మాజీ కౌన్సిలర్ ఇటికల దేవేందర్,కుతాడి సురేష్,నాగారం శంకర్,మంద శివ,పులిగిల్ల బాలయ్య,ఐలాపురం బాబు,ఎండి భారీ,ఎండి.అమానతుల్లా,ఎడబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News