రామన్నపేట మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా పద్మశాలి కాలనీలో ప్రజా సమస్యలపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లను నిజమైన పేదలకు ఇవ్వాలని, రైతు భరోసా సకాలంలో అందించి రైతులకు పెట్టుబడి సాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, సిపిఐ ప్రతిపక్షంగా అసెంబ్లీలో సమర్థంగా పని చేస్తోందని ప్రజలు అభినందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, గంగాపురం వెంకటయ్య, ఎర్ర బిక్షపతి, కళ్ళెం యాదగిరి, రచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి