Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:16 AM

ఇంటింటికి సిపిఐ – ప్రజా సమస్యలపై గళమెత్తిన నాయకులు

ఇంటింటికి సిపిఐ – ప్రజా సమస్యలపై గళమెత్తిన నాయకులు

ఇంటింటికి సిపిఐ – ప్రజా సమస్యలపై గళమెత్తిన నాయకులు
April 10, 2026 05:35 PM 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా పద్మశాలి కాలనీలో ప్రజా సమస్యలపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లను నిజమైన పేదలకు ఇవ్వాలని, రైతు భరోసా సకాలంలో అందించి రైతులకు పెట్టుబడి సాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, సిపిఐ ప్రతిపక్షంగా అసెంబ్లీలో సమర్థంగా పని చేస్తోందని ప్రజలు అభినందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, గంగాపురం వెంకటయ్య, ఎర్ర బిక్షపతి, కళ్ళెం యాదగిరి, రచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News