ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ నమోదు… ఎస్ఐ డి.నాగరాజు
ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ నమోదు… ఎస్ఐ డి.నాగరాజు
Editor Desk
పోలీస్ స్టేషన్కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు రామన్నపేట పోలీసులు అండగా నిలిచారు. బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్ఐ డి. నాగరాజు చొరవతో రెండు వేర్వేరు కేసుల్లో ఈ చర్యలు తీసుకున్నారు.
దుబ్బాక గ్రామానికి చెందిన మెడబోయిన పద్మ తన కుమారుడు మెడబోయిన పరుశురాములు (35) కనిపించకుండా పోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ నాగరాజు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సురేందర్, సిబ్బంది గ్రామానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
ఇక మరో ఘటనలో అర్రూరు (పెద్దబవి) గ్రామానికి చెందిన వాకిటి నర్సింహ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అక్కడికక్కడే ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్ఐ నాగరాజు తెలిపారు. అవసరమైతే బాధితుల వద్దకే వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి