Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:48 PM

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ డి.నాగరాజు

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ డి.నాగరాజు

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ  డి.నాగరాజు
08-04-2026 738 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు రామన్నపేట పోలీసులు అండగా నిలిచారు. బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్‌ఐ డి. నాగరాజు చొరవతో రెండు వేర్వేరు కేసుల్లో ఈ చర్యలు తీసుకున్నారు.

దుబ్బాక గ్రామానికి చెందిన మెడబోయిన పద్మ తన కుమారుడు మెడబోయిన పరుశురాములు (35) కనిపించకుండా పోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ నాగరాజు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సురేందర్, సిబ్బంది గ్రామానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇక మరో ఘటనలో అర్రూరు (పెద్దబవి) గ్రామానికి చెందిన వాకిటి నర్సింహ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అక్కడికక్కడే ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. అవసరమైతే బాధితుల వద్దకే వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Sthanikam

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ డి.నాగరాజు

Article Image

పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు రామన్నపేట పోలీసులు అండగా నిలిచారు. బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్‌ఐ డి. నాగరాజు చొరవతో రెండు వేర్వేరు కేసుల్లో ఈ చర్యలు తీసుకున్నారు.

దుబ్బాక గ్రామానికి చెందిన మెడబోయిన పద్మ తన కుమారుడు మెడబోయిన పరుశురాములు (35) కనిపించకుండా పోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ నాగరాజు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సురేందర్, సిబ్బంది గ్రామానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇక మరో ఘటనలో అర్రూరు (పెద్దబవి) గ్రామానికి చెందిన వాకిటి నర్సింహ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అక్కడికక్కడే ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. అవసరమైతే బాధితుల వద్దకే వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News