Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేటకు మళ్లీ పూర్వ వైభవం… నియోజకవర్గం ఏర్పాటు చేయాలి – పోతరాజు శంకరయ్య “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 10:55 PM

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ డి.నాగరాజు

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ డి.నాగరాజు

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ  డి.నాగరాజు
April 08, 2026 08:04 PM 284 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు రామన్నపేట పోలీసులు అండగా నిలిచారు. బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్‌ఐ డి. నాగరాజు చొరవతో రెండు వేర్వేరు కేసుల్లో ఈ చర్యలు తీసుకున్నారు.

దుబ్బాక గ్రామానికి చెందిన మెడబోయిన పద్మ తన కుమారుడు మెడబోయిన పరుశురాములు (35) కనిపించకుండా పోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ నాగరాజు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సురేందర్, సిబ్బంది గ్రామానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇక మరో ఘటనలో అర్రూరు (పెద్దబవి) గ్రామానికి చెందిన వాకిటి నర్సింహ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అక్కడికక్కడే ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. అవసరమైతే బాధితుల వద్దకే వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News