Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:48 PM

ఇంటర్ పరీక్షలపై ఆకస్మిక తనిఖీ. అదనపు కలెక్టర్ భాస్కరరావు

ఇంటర్ పరీక్షలపై ఆకస్మిక తనిఖీ. అదనపు కలెక్టర్ భాస్కరరావు

ఇంటర్ పరీక్షలపై ఆకస్మిక తనిఖీ. అదనపు కలెక్టర్ భాస్కరరావు
February 25, 2026 05:25 PM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సజావుగా నిర్వహించాలి… జవాబు పత్రాలు భద్రంగా తరలించాలి

ఆలేరు,: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, తాగునీటి సదుపాయం, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలను సమీక్షించారు. విద్యార్థులు భయాందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేలా చూడాలని సూచించారు.

పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్ష పూర్తైన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News