ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
ఇస్కిళ్ళలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
Editor Desk
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలంలోని ఇస్కిళ్ళ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం, పారదర్శక పాలన అందించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ మెంబర్ పిండి మల్లేష్, మండల కార్యదర్శి బందెల సంజీవ, 5వ వార్డ్ మెంబర్ సురకంటి అశోక్ రెడ్డి, రాపర్తి గణేష్, సత్యనారాయణ, ఉపేంద్ర చారి, పరశురామ్, లాల్ కృష్ణ, రాజు రెడ్డి, నవీన్, రవి, గిరి, విజయ్, నరేందర్ రెడ్డి, సిద్ధార్థ, దుర్గారావు తదితరులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి