PRINT TIME: March 11, 2026 03:26 PM
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్
March 11, 2026 09:18 AM
14 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న మసీద్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.
రంజాన్ మాసం శాంతి, సౌహార్దతలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎండి. యూసుఫ్, యూసఫ్ వలీ, అఫ్రోజ్, అసిఫ్, బాబా తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి