Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:12 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
27-04-2026 354 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని

ఇంద్రపాలనగరం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బీఆర్ఎస్, అనంతరం రాజకీయ పార్టీగా మారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ స్థాపనకు 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరితంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాకు వందనం చేసి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్రను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వడ్లకొండ లక్ష్మి, మల్లేశం, వరికుప్పల స్వామి, పుట్టల లక్ష్మి ముత్యాలు పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి (మాజీ ఏఎంసీ డైరెక్టర్), మండల నాయకులు రాస వెంకటేష్, పార్టీ కార్యదర్శి రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి, సింగణబోయిన సత్యనారాయణ (మాజీ పాలసంఘం చైర్మన్), సింగణబోయిన దశరథ, గర్ధాస్ కరుణాకర్ (మాజీ ఏఎంసీ డైరెక్టర్), సింగణబోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు హాజరయ్యారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Article Image

రామన్నపేట మండలంలోని

ఇంద్రపాలనగరం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బీఆర్ఎస్, అనంతరం రాజకీయ పార్టీగా మారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ స్థాపనకు 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరితంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాకు వందనం చేసి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్రను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వడ్లకొండ లక్ష్మి, మల్లేశం, వరికుప్పల స్వామి, పుట్టల లక్ష్మి ముత్యాలు పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి (మాజీ ఏఎంసీ డైరెక్టర్), మండల నాయకులు రాస వెంకటేష్, పార్టీ కార్యదర్శి రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి, సింగణబోయిన సత్యనారాయణ (మాజీ పాలసంఘం చైర్మన్), సింగణబోయిన దశరథ, గర్ధాస్ కరుణాకర్ (మాజీ ఏఎంసీ డైరెక్టర్), సింగణబోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News