Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 08:39 PM

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
April 27, 2026 11:33 AM 346 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని

ఇంద్రపాలనగరం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బీఆర్ఎస్, అనంతరం రాజకీయ పార్టీగా మారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ స్థాపనకు 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరితంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాకు వందనం చేసి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్రను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వడ్లకొండ లక్ష్మి, మల్లేశం, వరికుప్పల స్వామి, పుట్టల లక్ష్మి ముత్యాలు పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి (మాజీ ఏఎంసీ డైరెక్టర్), మండల నాయకులు రాస వెంకటేష్, పార్టీ కార్యదర్శి రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి, సింగణబోయిన సత్యనారాయణ (మాజీ పాలసంఘం చైర్మన్), సింగణబోయిన దశరథ, గర్ధాస్ కరుణాకర్ (మాజీ ఏఎంసీ డైరెక్టర్), సింగణబోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News