Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దుండగుల దాడిలో గాయపడిన దుశ్చర్ల సత్యనారాయణ పరామర్శ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 02:08 PM

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఇంద్రపాలనగరంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
April 27, 2026 11:33 AM 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని

ఇంద్రపాలనగరం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బీఆర్ఎస్, అనంతరం రాజకీయ పార్టీగా మారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ స్థాపనకు 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరితంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాకు వందనం చేసి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్రను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వడ్లకొండ లక్ష్మి, మల్లేశం, వరికుప్పల స్వామి, పుట్టల లక్ష్మి ముత్యాలు పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి (మాజీ ఏఎంసీ డైరెక్టర్), మండల నాయకులు రాస వెంకటేష్, పార్టీ కార్యదర్శి రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి, సింగణబోయిన సత్యనారాయణ (మాజీ పాలసంఘం చైర్మన్), సింగణబోయిన దశరథ, గర్ధాస్ కరుణాకర్ (మాజీ ఏఎంసీ డైరెక్టర్), సింగణబోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News