రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామంలో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య భీమా నాయక్ , వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి తో కలిసి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్లు,వార్డ్ సభ్యులు, రైతులు, ఐకేపీ నిర్వాహకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, ఐకేపీ ఏబీఎం, సీసీ, ప్యాక్స్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి