ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. మాయ కృష్ణ
ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. మాయ కృష్ణ
Editor Desk
భువనగిరి టౌన్, భువనగిరి పట్టణంలోని 14వ వార్డు హుస్నాబాద్ ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ కాలనీ నిర్మాణం జరిగి సుమారు 15 సంవత్సరాలు పూర్తవుతున్నా, మౌలిక సదుపాయాల లేమితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద నిర్మించిన నీటి ట్యాంకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితమే పూర్తయినా, ఇప్పటివరకు కృష్ణా నీటిని అందులో నింపకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రస్తుతం కాలనీలో రోజుకొకసారి కూడా సరిపడా నీరు అందడం లేదని, ఒకటి రెండు డ్రమ్ముల నీటితోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, పార్కు, పాఠశాలలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక నిధులతో కాలనీ అభివృద్ధి పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. తక్షణమే ట్యాంకులో నీరు నింపి, నల్లాల ద్వారా ప్రతి ఇంటికి సరఫరా చేయాలని మాయ కృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, వోల్దాస్ అంజయ్య, కాలనీ శాఖ కార్యదర్శి అప్పల రాములు, పల్లెపాటి జయమ్మ, గంగారపు సుదర్శన్, ఊదరి ఎల్లయ్య, జిన్నా నరసింహ, వోల్దాస్ కవిత, వల్దాస్ ఇందిరా తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి