Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:27 PM

ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. మాయ కృష్ణ

ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. మాయ కృష్ణ

ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. మాయ కృష్ణ
15-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి టౌన్, భువనగిరి పట్టణంలోని 14వ వార్డు హుస్నాబాద్ ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ కాలనీ నిర్మాణం జరిగి సుమారు 15 సంవత్సరాలు పూర్తవుతున్నా, మౌలిక సదుపాయాల లేమితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద నిర్మించిన నీటి ట్యాంకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితమే పూర్తయినా, ఇప్పటివరకు కృష్ణా నీటిని అందులో నింపకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రస్తుతం కాలనీలో రోజుకొకసారి కూడా సరిపడా నీరు అందడం లేదని, ఒకటి రెండు డ్రమ్ముల నీటితోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, పార్కు, పాఠశాలలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక నిధులతో కాలనీ అభివృద్ధి పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. తక్షణమే ట్యాంకులో నీరు నింపి, నల్లాల ద్వారా ప్రతి ఇంటికి సరఫరా చేయాలని మాయ కృష్ణ కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, వోల్దాస్ అంజయ్య, కాలనీ శాఖ కార్యదర్శి అప్పల రాములు, పల్లెపాటి జయమ్మ, గంగారపు సుదర్శన్, ఊదరి ఎల్లయ్య, జిన్నా నరసింహ, వోల్దాస్ కవిత, వల్దాస్ ఇందిరా తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. మాయ కృష్ణ

Article Image

భువనగిరి టౌన్, భువనగిరి పట్టణంలోని 14వ వార్డు హుస్నాబాద్ ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ కాలనీ నిర్మాణం జరిగి సుమారు 15 సంవత్సరాలు పూర్తవుతున్నా, మౌలిక సదుపాయాల లేమితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద నిర్మించిన నీటి ట్యాంకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితమే పూర్తయినా, ఇప్పటివరకు కృష్ణా నీటిని అందులో నింపకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రస్తుతం కాలనీలో రోజుకొకసారి కూడా సరిపడా నీరు అందడం లేదని, ఒకటి రెండు డ్రమ్ముల నీటితోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, పార్కు, పాఠశాలలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక నిధులతో కాలనీ అభివృద్ధి పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. తక్షణమే ట్యాంకులో నీరు నింపి, నల్లాల ద్వారా ప్రతి ఇంటికి సరఫరా చేయాలని మాయ కృష్ణ కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, వోల్దాస్ అంజయ్య, కాలనీ శాఖ కార్యదర్శి అప్పల రాములు, పల్లెపాటి జయమ్మ, గంగారపు సుదర్శన్, ఊదరి ఎల్లయ్య, జిన్నా నరసింహ, వోల్దాస్ కవిత, వల్దాస్ ఇందిరా తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News