హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం
Editor Desk
భువనగిరి,
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హోమియో ఆయుష్ డే సందర్భంగా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో యోగ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ వేముల వినత (ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్), జక్కల సాయి తేజ (యోగ ఇన్స్ట్రక్టర్) ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా యోగ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ పలు యోగాసనాలను ప్రదర్శించారు. గ్రామస్తులు ప్రతిరోజూ యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్, వార్డ్ సభ్యుడు మట్ట శీను, బొల్లేపల్లి అశోక్, కొంతం సత్తిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రావి ఇంద్రసేనారెడ్డి, ఈర్లపల్లి రాజు, గాద జయేందర్, గడ్డమీది స్వామి, పిన్నింటి వెంకటరెడ్డి, బుంగపట్ల అంజయ్య, పన్నీర్ దానయ్య, ఈర్లపల్లి జానయ్య, వాకిటి మల్లారెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి