Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:07 AM

హెల్త్ వీక్‌లో ఘనంగా ఆయుష్ దినోత్సవం – మెగా వైద్య శిబిరం

హెల్త్ వీక్‌లో ఘనంగా ఆయుష్ దినోత్సవం – మెగా వైద్య శిబిరం

హెల్త్ వీక్‌లో ఘనంగా ఆయుష్ దినోత్సవం – మెగా వైద్య శిబిరం
April 10, 2026 05:55 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో హెల్త్ వీక్ డే–5 సందర్భంగా ఆయుష్ & హోమియోపతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హోమియోపతి వైద్యశాస్త్ర పితామహుడు డా. సి.ఎఫ్. శామ్యూల్ హానిమన్ 271వ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు.

డా. ఎం. మనోహర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 6:30 నుంచి 7:30 వరకు యోగా కార్యక్రమం నిర్వహించగా, సుమారు 70 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యోగా ట్రైనర్లు రామకృష్ణ, ఝాన్సీ, సరిత శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా డా. మనోహర్ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, నిత్య యోగాభ్యాసం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు.

అనంతరం హోమియోపతి, ఆయుర్వేద, యునాని విధానాలతో మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డా. మనోహర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో డా. జె.ఆర్. సంగీత (CMO), డా. కె. బాల భవాని (SMO), డా. కె. సద్గుణ, డా. వి. విజయలక్ష్మి, డా. చి. శ్రీనివాస్, డా. పి. కవిత, డా. రోజ్ మేరీ తదితరులు సేవలు అందించారు.

ఈ సందర్భంగా ఆయుష్ వైద్య విధానాల ప్రాముఖ్యతను వివరిస్తూ, సహజసిద్ధమైన చికిత్సలతో వ్యాధి నివారణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని డా. మనోహర్ తెలిపారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో హోమియోపతి 82, ఆయుర్వేద 40, యునాని 60 మంది రోగులు చికిత్స పొందగా, మొత్తం 182 మంది లబ్ధి పొందారు.

ఈ కార్యక్రమంలో డా. పాండు నాయక్ సూపరింటెండెంట్‌తో పాటు వైద్యులు, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News