Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:09 PM

హెల్త్ వీక్–డే 3: సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

హెల్త్ వీక్–డే 3: సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

హెల్త్ వీక్–డే 3: సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
April 08, 2026 06:45 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా “సేఫ్ మదర్ హుడ్ – కేర్ ఫర్ మదర్, హెల్త్ ఫర్ ఎవ్రీ డే” అనే థీమ్‌తో హెల్త్ వీక్–డే 3 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సూపర్‌వైజరీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ANMs, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 108 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా ANC (గర్భిణీ పరీక్షలు), హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణ, పోషణ–అనీమియా నివారణ, HBNC (హోమ్ బేస్డ్ నియోనేటల్ కేర్), కుటుంబ నియంత్రణ, సంకల్ప్ ప్రోటోకాల్, మాతృ మరణాల సమీక్ష, PC-PNDT చట్టం అమలు వంటి అంశాలపై నిపుణులు ప్రత్యేక సెషన్లు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. మనోహర్, ప్రోగ్రాం అధికారి డా. యశోద, DCHS డా. చిన్న నాయక్, గైనకాలజీ హెచ్‌వోడి డా. ఇందిర మణి, పీడియాట్రిక్ హెచ్‌వోడి డా. నిర్మల, గైనకాలజిస్టులు డా. జ్యోతి, డా. స్వప్న రాథోడ్, డా. శ్వేతా ప్రియాంక, డా. స్వరాజ్య లక్ష్మి తదితరులు పాల్గొని శిక్షణ అందించారు.

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీకి సురక్షిత ప్రసవం జరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ట్యాగ్ చేసిన ఆసుపత్రులతో అనుసంధానం చేసి సమయానుకూలంగా వైద్య సేవలు అందించాలన్నారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, శిశువులకు నాణ్యమైన సేవలు అందించేందుకు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వైద్యులు, ANMs, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News