హెల్త్ వీక్–డే 3: సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
హెల్త్ వీక్–డే 3: సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా “సేఫ్ మదర్ హుడ్ – కేర్ ఫర్ మదర్, హెల్త్ ఫర్ ఎవ్రీ డే” అనే థీమ్తో హెల్త్ వీక్–డే 3 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సూపర్వైజరీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ANMs, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 108 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా ANC (గర్భిణీ పరీక్షలు), హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణ, పోషణ–అనీమియా నివారణ, HBNC (హోమ్ బేస్డ్ నియోనేటల్ కేర్), కుటుంబ నియంత్రణ, సంకల్ప్ ప్రోటోకాల్, మాతృ మరణాల సమీక్ష, PC-PNDT చట్టం అమలు వంటి అంశాలపై నిపుణులు ప్రత్యేక సెషన్లు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. మనోహర్, ప్రోగ్రాం అధికారి డా. యశోద, DCHS డా. చిన్న నాయక్, గైనకాలజీ హెచ్వోడి డా. ఇందిర మణి, పీడియాట్రిక్ హెచ్వోడి డా. నిర్మల, గైనకాలజిస్టులు డా. జ్యోతి, డా. స్వప్న రాథోడ్, డా. శ్వేతా ప్రియాంక, డా. స్వరాజ్య లక్ష్మి తదితరులు పాల్గొని శిక్షణ అందించారు.
అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీకి సురక్షిత ప్రసవం జరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ట్యాగ్ చేసిన ఆసుపత్రులతో అనుసంధానం చేసి సమయానుకూలంగా వైద్య సేవలు అందించాలన్నారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, శిశువులకు నాణ్యమైన సేవలు అందించేందుకు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వైద్యులు, ANMs, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి