Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:47 PM

హయత్‌నగర్‌లో పూలే జయంతి – మహిళా విద్యకు పునాది వేసిన మహనీయుడు

హయత్‌నగర్‌లో పూలే జయంతి – మహిళా విద్యకు పునాది వేసిన మహనీయుడు

హయత్‌నగర్‌లో పూలే జయంతి – మహిళా విద్యకు పునాది వేసిన మహనీయుడు
April 11, 2026 07:58 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా హయత్‌నగర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ హాస్టల్‌లో కూడా జయంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పూలే గొప్ప సంఘసంస్కర్తగా సమాజ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి బాలికల పాఠశాలలు స్థాపించడం ద్వారా మహిళా విద్యకు పునాది వేశారని తెలిపారు.

సత్యశోధక్ సమాజ్ స్థాపనతో సమానత్వం కోసం పోరాడిన మహనీయుడిగా పూలేను కొనియాడారు. ప్రతి బీసీ హాస్టల్, గురుకుల పాఠశాలల్లో ఆయన పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఆయన పేరును విశ్వవిద్యాలయానికి పెట్టాలని కోరారు.

డా. మక్ల మాట్లాడుతూ పూలే గొప్ప తత్వవేత్త, రచయిత అని, ఆయన రచించిన ‘గులాం గిరీ’ సమాజానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్ర, హాస్టల్ సంక్షేమ అధికారి, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News