హయత్నగర్లో పూలే జయంతి – మహిళా విద్యకు పునాది వేసిన మహనీయుడు
హయత్నగర్లో పూలే జయంతి – మహిళా విద్యకు పునాది వేసిన మహనీయుడు
Editor Desk
హయత్నగర్: మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా హయత్నగర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ హాస్టల్లో కూడా జయంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పూలే గొప్ప సంఘసంస్కర్తగా సమాజ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి బాలికల పాఠశాలలు స్థాపించడం ద్వారా మహిళా విద్యకు పునాది వేశారని తెలిపారు.
సత్యశోధక్ సమాజ్ స్థాపనతో సమానత్వం కోసం పోరాడిన మహనీయుడిగా పూలేను కొనియాడారు. ప్రతి బీసీ హాస్టల్, గురుకుల పాఠశాలల్లో ఆయన పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఆయన పేరును విశ్వవిద్యాలయానికి పెట్టాలని కోరారు.
డా. మక్ల మాట్లాడుతూ పూలే గొప్ప తత్వవేత్త, రచయిత అని, ఆయన రచించిన ‘గులాం గిరీ’ సమాజానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్ర, హాస్టల్ సంక్షేమ అధికారి, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి