Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 PM

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం
01-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాలీబాల్ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. శారీరక విద్యా విభాగం ఆధ్వర్యంలో స్థానిక బాలబాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం కళాశాల ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టినదని నిర్వాహకులు తెలిపారు. 12 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో శారీరక దృఢత్వం పెంపొందించడం, క్రీడలపై ఆసక్తి కలిగించడం లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు అధ్యక్షతన, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె. అనిత మార్గదర్శకత్వంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది.

ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకు కళాశాల మైదానంలో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.

శిబిరం ద్వారా పాల్గొనే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతను ప్రోత్సహించి భవిష్యత్ అవకాశాల వైపు దారి చూపించనున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమానికి మధు, బాలనరసింహ, శేఖర్, నాగేంద్ర, అపర్ణ చతుర్వేది, రమాదేవి, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

ఈ శిబిరానికి స్థానికంగా మంచి స్పందన లభిస్తున్నదని ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత తెలిపారు.

Sthanikam

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

Article Image

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాలీబాల్ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. శారీరక విద్యా విభాగం ఆధ్వర్యంలో స్థానిక బాలబాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం కళాశాల ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టినదని నిర్వాహకులు తెలిపారు. 12 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో శారీరక దృఢత్వం పెంపొందించడం, క్రీడలపై ఆసక్తి కలిగించడం లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు అధ్యక్షతన, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె. అనిత మార్గదర్శకత్వంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది.

ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకు కళాశాల మైదానంలో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.

శిబిరం ద్వారా పాల్గొనే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతను ప్రోత్సహించి భవిష్యత్ అవకాశాల వైపు దారి చూపించనున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమానికి మధు, బాలనరసింహ, శేఖర్, నాగేంద్ర, అపర్ణ చతుర్వేది, రమాదేవి, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

ఈ శిబిరానికి స్థానికంగా మంచి స్పందన లభిస్తున్నదని ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News