Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 09:29 PM

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం
April 01, 2026 07:49 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాలీబాల్ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. శారీరక విద్యా విభాగం ఆధ్వర్యంలో స్థానిక బాలబాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం కళాశాల ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టినదని నిర్వాహకులు తెలిపారు. 12 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో శారీరక దృఢత్వం పెంపొందించడం, క్రీడలపై ఆసక్తి కలిగించడం లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు అధ్యక్షతన, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె. అనిత మార్గదర్శకత్వంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది.

ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకు కళాశాల మైదానంలో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.

శిబిరం ద్వారా పాల్గొనే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతను ప్రోత్సహించి భవిష్యత్ అవకాశాల వైపు దారి చూపించనున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమానికి మధు, బాలనరసింహ, శేఖర్, నాగేంద్ర, అపర్ణ చతుర్వేది, రమాదేవి, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

ఈ శిబిరానికి స్థానికంగా మంచి స్పందన లభిస్తున్నదని ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News