Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:10 AM

హరిత ఇంధనంపై జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ

హరిత ఇంధనంపై జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ

హరిత ఇంధనంపై జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ
March 09, 2026 04:58 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న హరిత ఇంధన వనరులు, పర్యావరణ పరిరక్షణపై రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. అంజిరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సదస్సు కన్వీనర్ డా. అంతటి శ్రీనివాస్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో హరిత ఇంధన వనరులు కీలకమని అన్నారు. శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి సౌర, పవన శక్తిని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హరిత ఇంధన వినియోగంతో గాలి, నీరు, నేల కాలుష్యం తగ్గి పర్యావరణం స్వచ్ఛంగా మారుతుందని, ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు.

ప్రభుత్వం సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించే జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల ఆచార్యులు, కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు హాజరుకానున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, అధ్యాపకులు డా. అనిల్ అబ్రహం, డా. అనిల్ బొజ్జ, డా. బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News