Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:09 PM

హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు

హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు

హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు
25-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలి కార్మికుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటోందని తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు ఆరోపించారు.

సిఐటియు ఆధ్వర్యంలో శనివారం భువనగిరి మండలంలోని వీరవల్లి, చందపట్ల, ముస్తాల, పెళ్లిచీమల కొండూరు గ్రామాల్లో హమాలి కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ ఐకెపి సెంటర్లలో పనిచేస్తున్న గ్రామీణ హమాలి కార్మికులకు ధరలకు అనుగుణంగా పారితోషికాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా అదే కేంద్రాల్లో పని చేస్తున్నా కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. తాగునీరు, విశ్రాంతి వసతులు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కార్మిక చట్టాలు అమలు చేయకుండా స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు హమాలి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వాటిని విస్మరించిందని విమర్శించారు.

హమాలి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, రేట్లు పెంచడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మయ్య, నరసింహ, ఐలయ్య, బాల మల్లయ్య, చంద్రయ్య, ఎలేందర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు

Article Image

భువనగిరి,: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలి కార్మికుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటోందని తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు ఆరోపించారు.

సిఐటియు ఆధ్వర్యంలో శనివారం భువనగిరి మండలంలోని వీరవల్లి, చందపట్ల, ముస్తాల, పెళ్లిచీమల కొండూరు గ్రామాల్లో హమాలి కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ ఐకెపి సెంటర్లలో పనిచేస్తున్న గ్రామీణ హమాలి కార్మికులకు ధరలకు అనుగుణంగా పారితోషికాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా అదే కేంద్రాల్లో పని చేస్తున్నా కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. తాగునీరు, విశ్రాంతి వసతులు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కార్మిక చట్టాలు అమలు చేయకుండా స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు హమాలి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వాటిని విస్మరించిందని విమర్శించారు.

హమాలి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, రేట్లు పెంచడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మయ్య, నరసింహ, ఐలయ్య, బాల మల్లయ్య, చంద్రయ్య, ఎలేందర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News