Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 03:13 PM

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య
April 24, 2026 04:41 PM 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదిక అంత తప్పుల తడక అని. ఈ రిపోర్ట్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్,.మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్త్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు.. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్ర బయట పడిందని అన్నారు.. కేసీఆర్. హరీష్ రావు. లను బదనాం చేసేందుకే కమిషన్ వేసి ప్రజా ధనం లూటీ చేశారని. తాము అధికారంలోకి రావడానికి ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసేందుకే కమిషన్ వేశారని అన్నారు.. ఇలాంటి తప్పుడు కమీషన్ లు.. కేసులు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తూ రెండున్నర ఏండ్లు గడిపారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అంతులేని వ్యతిరేకత పెరిగిందని. ఎప్పుడూ అవకాశం వస్తె అప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు

ఆర్టీసీ కార్మికులు ఆత్మ హత్యలు చేసుకోవద్దు.. పోరాటం ద్వారా హక్కులు సాధించుకోవాలి ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ ఎన్నికల మ్యానిపేస్తో లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని. సమ్మె త్వరగా విరమింప చేయాలని.. ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్ తడకమళ్ళ రవికుమార్ఉప్పల నాగమల్లు. గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్.. నల్లబెల్లి వెంకటేష్. కొండగడుపుల వెంకటేష్. బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News