గోరంట్లలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గ్రామసభ
గోరంట్లలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గ్రామసభ
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా /గోరంట్ల
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గోరంట్ల మండలం శిరగోవాండ్లపల్లి గ్రామంలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఎంపీడీఓ కమలబాయ్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు పై చర్చించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్, జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, కూరమాల జయరాం, బీరేవేణు, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, మాజీ సర్పంచులు ఉత్తమరెడ్డి, నీడిమామీడప్ప, సింగిల్ విండో డైరెక్టర్ నబిరసూల్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవీంద్రనాయక్, శ్రీనివాసులు, పచ్చ అశోక్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు ఉమాశంకర్, టౌన్ కన్వీనర్ కక్కల రఘునాథరెడ్డి తదితరులు, పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి