గంజాయితో ఐదుగురు అరెస్ట్
గంజాయితో ఐదుగురు అరెస్ట్
Editor Desk
తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదాపూర్ గ్రామ శివారులో గంజాయితో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్లమ్మ గుడి సమీపంలో తనిఖీలు నిర్వహించిన తుర్కపల్లి ఎస్సై, సిబ్బందితో కలిసి అనుమానితులను పట్టుకున్నారు.
వారి వద్ద సుమారు 200 గ్రాముల గంజాయి లభ్యమైందని పోలీసులు తెలిపారు. విచారణలో వారు గంజాయిని కలకత్తా నుంచి కొనుగోలు చేసి మాదాపూర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
నిందితుల వివరాలు
ఒగ్గు బాబు, జూకంటి సత్యం, ఒగ్గు నవీన్ కుమార్, జూకంటి శివకుమార్ (మాదాపూర్ గ్రామం), ధీరావత్ దేవేందర్ (వాలు తండ, బొమ్మలరామారం మండలం)గా గుర్తించారు.
స్వాధీనం చేసిన వస్తువులు
200 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గంజాయి వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కేసు యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్, డీఎస్పీ పి. శ్రీనివాస్ నాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. శంకర్ పర్యవేక్షణలో తుర్కపల్లి ఎస్సై మహమ్మద్ తఖియుద్దీన్ మరియు సిబ్బంది చర్యలు చేపట్టారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి