ఘనంగా రామన్నపేటలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా రామన్నపేటలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
Editor Desk
రామన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ… శ్యామా ప్రసాద్ ముఖర్జీ వేసిన బలమైన పునాదులపై పార్టీ నిర్మితమైందన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాద సిద్ధాంతంతో, సమాజంలోని చివరి వ్యక్తికీ ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోందని తెలిపారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే నినాదంతో, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వంటి అగ్రనేతల మార్గదర్శకత్వంలో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మడూరి ప్రభాకర్ రావు, కట్కూరి బిక్షపతి, కొమ్ము యాదయ్య, కూనూరు సుధాకర్, ఏలూరు రవి, యాదాసు లక్ష్మణ్, గుండాల అంజయ్య, కొడారి వెంకటేష్ యాదవ్, గుంటోజు కృష్ణమాచారి, అక్కినపల్లి సైదులు, నడిగోటి సైదులు, మందడి శ్రీధర్ రెడ్డి, శుభకోటి శశి, కర్నాటి నరేష్, వడ్డేపల్లి అంబదాస్, దావునూరి గురిగి బీరప్ప, గొరిగే బాలకృష్ణ, అజయ్, కానుకుర్తి అంజయ్య, ఏరువా సాయి, కట్కూరి అరవింద్, కన్నెగంటి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి