ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి
Editor Desk
రామన్నపేట: సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్ వద్ద పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ కో-కన్వీనర్ నాగటి ఉపేందర్, గౌరవ సలహాదారు నకిరేకంటి మొగులయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అక్షరజ్ఞానం అందించి సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. 199 ఏళ్లు పూర్తి చేసుకుని 200వ జయంతి ఉత్సవాల్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
కుల వివక్ష లేని సమాజం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని, పూలే–అంబేద్కర్ ఆశయాల సాధనకే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర నరేష్, కమిటీ సభ్యులు గాదె నరేందర్, నోముల చిరంజీవి, నాగటి యాదయ్య, గన్నబోయిన విజయభాస్కర్, యాదాసు యాదయ్య, బాదే అశోక్, నకిరేకంటి నరేష్, నరసింహ, కర్నే వినయ్, నోముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి