Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:42 PM

ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి

ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి

ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి
11-04-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్ వద్ద పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ కో-కన్వీనర్ నాగటి ఉపేందర్, గౌరవ సలహాదారు నకిరేకంటి మొగులయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అక్షరజ్ఞానం అందించి సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. 199 ఏళ్లు పూర్తి చేసుకుని 200వ జయంతి ఉత్సవాల్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

కుల వివక్ష లేని సమాజం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని, పూలే–అంబేద్కర్ ఆశయాల సాధనకే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర నరేష్, కమిటీ సభ్యులు గాదె నరేందర్, నోముల చిరంజీవి, నాగటి యాదయ్య, గన్నబోయిన విజయభాస్కర్, యాదాసు యాదయ్య, బాదే అశోక్, నకిరేకంటి నరేష్, నరసింహ, కర్నే వినయ్, నోముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి

Article Image

రామన్నపేట: సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్ వద్ద పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ కో-కన్వీనర్ నాగటి ఉపేందర్, గౌరవ సలహాదారు నకిరేకంటి మొగులయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అక్షరజ్ఞానం అందించి సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. 199 ఏళ్లు పూర్తి చేసుకుని 200వ జయంతి ఉత్సవాల్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

కుల వివక్ష లేని సమాజం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని, పూలే–అంబేద్కర్ ఆశయాల సాధనకే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర నరేష్, కమిటీ సభ్యులు గాదె నరేందర్, నోముల చిరంజీవి, నాగటి యాదయ్య, గన్నబోయిన విజయభాస్కర్, యాదాసు యాదయ్య, బాదే అశోక్, నకిరేకంటి నరేష్, నరసింహ, కర్నే వినయ్, నోముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News