Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:49 PM

ఘనంగా హోమియోపతి దినోత్సవం – ఉచిత వైద్య శిబిరం

ఘనంగా హోమియోపతి దినోత్సవం – ఉచిత వైద్య శిబిరం

ఘనంగా హోమియోపతి దినోత్సవం – ఉచిత వైద్య శిబిరం
10-04-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి జిల్లా ఆసుపత్రి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ "ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక"లో భాగంగా హోమియోపతి వైద్య శాస్త్ర పితామహుడు డాక్టర్ సి.ఎఫ్. శామ్యూల్ హానీమన్ 271వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా హోమియోపతి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

అంతకుముందు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైద్య శిబిరం వద్ద జరిగిన సమావేశంలో జిల్లా హోమియో ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంగీత మాట్లాడుతూ, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. భువనగిరి ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హోమియోపతి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలభారతి, డాక్టర్ సద్గుణ, డాక్టర్ కవిత, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రోజీమేరీ, సామాజిక కార్యకర్తలు డాక్టర్ బర్రె ప్రమీల, సద్ది వెంకట్ రెడ్డి, జంపాల అంజయ్య, మాటూరి బాలేశ్వర్, కొడారి వెంకటేష్, యోగా మాస్టర్, హోమియోపతి వైద్య సిబ్బంది, పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా హోమియోపతి దినోత్సవం – ఉచిత వైద్య శిబిరం

Article Image

భువనగిరి జిల్లా ఆసుపత్రి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ "ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక"లో భాగంగా హోమియోపతి వైద్య శాస్త్ర పితామహుడు డాక్టర్ సి.ఎఫ్. శామ్యూల్ హానీమన్ 271వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా హోమియోపతి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

అంతకుముందు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైద్య శిబిరం వద్ద జరిగిన సమావేశంలో జిల్లా హోమియో ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంగీత మాట్లాడుతూ, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. భువనగిరి ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హోమియోపతి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలభారతి, డాక్టర్ సద్గుణ, డాక్టర్ కవిత, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రోజీమేరీ, సామాజిక కార్యకర్తలు డాక్టర్ బర్రె ప్రమీల, సద్ది వెంకట్ రెడ్డి, జంపాల అంజయ్య, మాటూరి బాలేశ్వర్, కొడారి వెంకటేష్, యోగా మాస్టర్, హోమియోపతి వైద్య సిబ్బంది, పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News