గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్న ఎన్జీ కళాశాల విద్యార్థులు
గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్న ఎన్జీ కళాశాల విద్యార్థులు
Editor Desk
: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రీజినల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ స్టడీస్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఎన్జీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
యువ ఆపద మిత్ర వాలంటీర్లకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుండెపోటు వచ్చినప్పుడు సీపీఆర్ విధానం, వరదల సమయంలో ప్రజలను రక్షించే పద్ధతులు, భూకంపాలు, సునామీ వంటి విపత్తుల సమయంలో బాధితులకు సహాయం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాలపై వారం రోజులపాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న వాలంటీర్లకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవి వర్మ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అభినందించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు నర్సింగ్ కోటయ్య, ఎం. వెంకటరెడ్డి, బొజ్జ అనిల్ కుమార్, డాక్టర్ అదె మల్లేశం, కంభంపల్లి శివరాణి, ఎం. సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
యువ అపదమిత్ర వాలంటీర్స్ ను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి