గౌస్నగర్లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గౌస్నగర్లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా గౌస్నగర్ గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బీఆర్ఎస్, అనంతరం రాజకీయ పార్టీగా మారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామాభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీళ్ళ కృష్ణ పుష్ప, మాజీ ఉపసర్పంచ్ రెడ్డి, నల్ల వాజ్ కుమార్, మల్లేష్ గౌడ్, మాజీ వార్డ్ సభ్యుడు సిద్దులు యాదవ్, వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి