Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన.. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 PM

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!
April 02, 2026 06:37 PM 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శాశ్వత కట్టడాలకు యత్నం.. గ్రామసభలో వినతి.

రామన్నపేట: ప్రభుత్వ గ్రంథాలయానికి ఆనుకొని ఉన్న భూమిపై ఇతరులు కన్నేసి శాశ్వత కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై గ్రంథాలయ ఉద్యోగి కట్కురి నరసింహ గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ కార్యదర్శి సైదిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయానికి సంబంధించిన భూమిలోనే కొత్త భవనం నిర్మించినప్పటికీ, ప్రహరీ గోడ మరియు మూత్రశాలల నిర్మాణం నిధుల లేమితో ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించి శాశ్వత కట్టడాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రంథాలయానికి చెందిన ఆస్తిని రక్షించే బాధ్యత అధికారులపై ఉందని, ఆక్రమణదారులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు ఆయన వెల్లడించారు.

గ్రామసభలో ఈ అంశం చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు స్పందించి భూమి రక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News