గ్రంథాలయ భూమిపై కన్నేశారు!
గ్రంథాలయ భూమిపై కన్నేశారు!
Editor Desk
శాశ్వత కట్టడాలకు యత్నం.. గ్రామసభలో వినతి.
రామన్నపేట: ప్రభుత్వ గ్రంథాలయానికి ఆనుకొని ఉన్న భూమిపై ఇతరులు కన్నేసి శాశ్వత కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై గ్రంథాలయ ఉద్యోగి కట్కురి నరసింహ గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ కార్యదర్శి సైదిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయానికి సంబంధించిన భూమిలోనే కొత్త భవనం నిర్మించినప్పటికీ, ప్రహరీ గోడ మరియు మూత్రశాలల నిర్మాణం నిధుల లేమితో ఇంకా పెండింగ్లోనే ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించి శాశ్వత కట్టడాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రంథాలయానికి చెందిన ఆస్తిని రక్షించే బాధ్యత అధికారులపై ఉందని, ఆక్రమణదారులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు ఆయన వెల్లడించారు.
గ్రామసభలో ఈ అంశం చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు స్పందించి భూమి రక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి