Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 PM

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!
02-04-2026 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శాశ్వత కట్టడాలకు యత్నం.. గ్రామసభలో వినతి.

రామన్నపేట: ప్రభుత్వ గ్రంథాలయానికి ఆనుకొని ఉన్న భూమిపై ఇతరులు కన్నేసి శాశ్వత కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై గ్రంథాలయ ఉద్యోగి కట్కురి నరసింహ గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ కార్యదర్శి సైదిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయానికి సంబంధించిన భూమిలోనే కొత్త భవనం నిర్మించినప్పటికీ, ప్రహరీ గోడ మరియు మూత్రశాలల నిర్మాణం నిధుల లేమితో ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించి శాశ్వత కట్టడాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రంథాలయానికి చెందిన ఆస్తిని రక్షించే బాధ్యత అధికారులపై ఉందని, ఆక్రమణదారులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు ఆయన వెల్లడించారు.

గ్రామసభలో ఈ అంశం చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు స్పందించి భూమి రక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

Sthanikam

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!

Article Image

శాశ్వత కట్టడాలకు యత్నం.. గ్రామసభలో వినతి.

రామన్నపేట: ప్రభుత్వ గ్రంథాలయానికి ఆనుకొని ఉన్న భూమిపై ఇతరులు కన్నేసి శాశ్వత కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై గ్రంథాలయ ఉద్యోగి కట్కురి నరసింహ గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ కార్యదర్శి సైదిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయానికి సంబంధించిన భూమిలోనే కొత్త భవనం నిర్మించినప్పటికీ, ప్రహరీ గోడ మరియు మూత్రశాలల నిర్మాణం నిధుల లేమితో ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించి శాశ్వత కట్టడాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రంథాలయానికి చెందిన ఆస్తిని రక్షించే బాధ్యత అధికారులపై ఉందని, ఆక్రమణదారులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు ఆయన వెల్లడించారు.

గ్రామసభలో ఈ అంశం చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు స్పందించి భూమి రక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News