గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు
గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు
Editor Desk
రామన్నపేట: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో సర్పంచుల అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు, సీఐ యన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో “రోడ్ సేఫ్టీ గ్రామ సభలు” నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో 8–9 మంది సభ్యులతో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, వైద్యులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన ప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
గ్రామాల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం, తెరిచి ఉన్న బావులను మూయించడం, రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రోడ్డు భద్రతపై ప్రచారం విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎస్ఐ సురేందర్, స్వామి నాయక్, కృష్ణమూర్తి, హనుమంతు,వెంకటేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి