Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:49 PM

గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు

గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు

గ్రామాల్లో రోడ్డు భద్రతపై  ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు
11-04-2026 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో సర్పంచుల అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు, సీఐ యన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో “రోడ్ సేఫ్టీ గ్రామ సభలు” నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో 8–9 మంది సభ్యులతో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, వైద్యులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన ప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

గ్రామాల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం, తెరిచి ఉన్న బావులను మూయించడం, రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రోడ్డు భద్రతపై ప్రచారం విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎస్ఐ సురేందర్, స్వామి నాయక్, కృష్ణమూర్తి, హనుమంతు,వెంకటేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు





Sthanikam

గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు

Article Image

రామన్నపేట: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో సర్పంచుల అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు, సీఐ యన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో “రోడ్ సేఫ్టీ గ్రామ సభలు” నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో 8–9 మంది సభ్యులతో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, వైద్యులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన ప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

గ్రామాల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం, తెరిచి ఉన్న బావులను మూయించడం, రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రోడ్డు భద్రతపై ప్రచారం విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎస్ఐ సురేందర్, స్వామి నాయక్, కృష్ణమూర్తి, హనుమంతు,వెంకటేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News