Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:25 PM

గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు

గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు

గ్రామాల్లో రోడ్డు భద్రతపై  ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు
April 11, 2026 12:37 PM 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో సర్పంచుల అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు, సీఐ యన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో “రోడ్ సేఫ్టీ గ్రామ సభలు” నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో 8–9 మంది సభ్యులతో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, వైద్యులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన ప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

గ్రామాల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం, తెరిచి ఉన్న బావులను మూయించడం, రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రోడ్డు భద్రతపై ప్రచారం విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎస్ఐ సురేందర్, స్వామి నాయక్, కృష్ణమూర్తి, హనుమంతు,వెంకటేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News