Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:15 AM

గజ్వేల్ ఘటనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. కాంగ్రెస్‌పై చిరుమర్తి తీవ్ర విమర్శలు

గజ్వేల్ ఘటనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. కాంగ్రెస్‌పై చిరుమర్తి తీవ్ర విమర్శలు

గజ్వేల్ ఘటనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. కాంగ్రెస్‌పై చిరుమర్తి తీవ్ర విమర్శలు
April 04, 2026 05:56 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర కార్యసాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. నకిరేకల్‌లో విలేఖరులతో మాట్లాడిన ఆయన, ఈ ఘటనను “పిరికిపంద దాడి”గా అభివర్ణించారు.

గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం రాష్ట్రంలో దిగజారుతున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు గత రెండేళ్లుగా వివిధ రూపాల్లో అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఆయన క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడం రాష్ట్ర పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోందన్నారు. పోలీసుల వ్యవహారశైలిపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి దాడులతో కేసీఆర్ అనుచరులు ఏమాత్రం భయపడరని స్పష్టం చేసిన లింగయ్య, ప్రజలు ఈ సంఘటనలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News