Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు చేతిలో రూ. 40, అకౌంట్‌లో రూ. 44… కేవలం రూ. 84 ఆస్తితో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి ఆష్నా తంపి సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 08:46 PM

గజ్వేల్ ఘటనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. కాంగ్రెస్‌పై చిరుమర్తి తీవ్ర విమర్శలు

గజ్వేల్ ఘటనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. కాంగ్రెస్‌పై చిరుమర్తి తీవ్ర విమర్శలు

గజ్వేల్ ఘటనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. కాంగ్రెస్‌పై చిరుమర్తి తీవ్ర విమర్శలు
April 04, 2026 05:56 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర కార్యసాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. నకిరేకల్‌లో విలేఖరులతో మాట్లాడిన ఆయన, ఈ ఘటనను “పిరికిపంద దాడి”గా అభివర్ణించారు.

గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం రాష్ట్రంలో దిగజారుతున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు గత రెండేళ్లుగా వివిధ రూపాల్లో అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఆయన క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడం రాష్ట్ర పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోందన్నారు. పోలీసుల వ్యవహారశైలిపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి దాడులతో కేసీఆర్ అనుచరులు ఏమాత్రం భయపడరని స్పష్టం చేసిన లింగయ్య, ప్రజలు ఈ సంఘటనలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News