ఎస్ఎస్సీ సీజీఎల్ ఫలితాల్లో ఐఏసీఈ ప్రభంజనం
ఎస్ఎస్సీ సీజీఎల్ ఫలితాల్లో ఐఏసీఈ ప్రభంజనం
Editor Desk
హైదరాబాద్,
ఎస్ఎస్సీ సీజీఎల్-2025 ఫలితాల్లో ఐఏసీఈ సంస్థ ఆల్ ఇండియా స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. టాప్ ర్యాంకులతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ప్రముఖ స్థానం దక్కించుకుంది.
ఈ సందర్భంగా ఐఏసీఈ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
వారు మాట్లాడుతూ… 2025 ఫలితాల్లో ఐఏసీఈ మరోసారి చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో 54, 59, 120, 287, 324, 349 వంటి ప్రముఖ ర్యాంకులు సాధించడం విశేషమన్నారు. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టామని పేర్కొన్నారు.
తరగతి గది శిక్షణ, విశ్లేషణాత్మక మాక్ టెస్టులు, ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులను సమర్థంగా తయారుచేసిన ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఐఆర్ఎఫ్ (ఐఏసీఈ రిజల్ట్స్ ఫ్యాక్టరీ) కీలక పాత్ర పోషించిందన్నారు.
ఈ చారిత్రక విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి