Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 07:28 PM

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్
April 22, 2026 05:06 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: ఈ నెల 24న భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగే ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొనాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి గ్రామంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. జిల్లాలో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.4,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని, అంత్యోదయ రేషన్ కార్డుతో 35 కిలోల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులకు ఇంటి వద్దే ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, ఉపాధ్యక్షుడు నాగు నరసింహ, సహాయక కార్యదర్శి పున్న శ్రీధర్, నాయకులు కుందూరు వెంకటేశం, పున్న సదానందం, వంగాల నరసింహ, పగిల రమేష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News