Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:09 PM

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్
22-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: ఈ నెల 24న భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగే ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొనాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి గ్రామంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. జిల్లాలో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.4,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని, అంత్యోదయ రేషన్ కార్డుతో 35 కిలోల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులకు ఇంటి వద్దే ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, ఉపాధ్యక్షుడు నాగు నరసింహ, సహాయక కార్యదర్శి పున్న శ్రీధర్, నాయకులు కుందూరు వెంకటేశం, పున్న సదానందం, వంగాల నరసింహ, పగిల రమేష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్

Article Image

రామన్నపేట,: ఈ నెల 24న భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగే ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొనాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి గ్రామంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. జిల్లాలో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.4,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని, అంత్యోదయ రేషన్ కార్డుతో 35 కిలోల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులకు ఇంటి వద్దే ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, ఉపాధ్యక్షుడు నాగు నరసింహ, సహాయక కార్యదర్శి పున్న శ్రీధర్, నాయకులు కుందూరు వెంకటేశం, పున్న సదానందం, వంగాల నరసింహ, పగిల రమేష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News