ఎన్నారం విద్యార్థులకు కరాటేలో రాష్ట్ర స్థాయి విజయాలు
ఎన్నారం విద్యార్థులకు కరాటేలో రాష్ట్ర స్థాయి విజయాలు
Editor Desk
యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ఎన్నారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. సల్ల వరూదిని (7వ తరగతి) ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, శ్రీరాముల చందు (8వ తరగతి) ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
మోక్షిత్, మణి తేజ, అమృత (7వ తరగతి), రమాదేవి, శరణ్య (9వ తరగతి) తృతీయ స్థానాలు సాధించి బ్రాంజ్ పతకాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు.
విద్యార్థుల విజయంపై ప్రధానోపాధ్యాయురాలు కమలాదేవి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఎస్కార్ట్ టీచర్ రమాబాయి, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను ప్రశంసించారు. కరాటే మాస్టర్ ప్రసాద్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యార్థుల విజయానికి సహకరించిన భాస్కర్ రెడ్డి, కొండూరు శంకర్, నీలం శేఖర్, బుచ్చి రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సహకారం కొనసాగితే మరిన్ని విజయాలు సాధిస్తామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి