ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్షాప్
ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్షాప్
Editor Desk
: నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సలాడ్ తయారీపై అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. నేషనల్ గ్రీన్ కోర్ప్స్మా ర్గదర్శకాల మేరకు సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష మాట్లాడుతూ తాజా కూరగాయలు, పండ్లతో తయారుచేసే సలాడ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయని తెలిపారు. సలాడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవడతాయని విద్యార్థులకు సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని అన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ పరంగి రవి, డాక్టర్ అంతటి శ్రీనివాసులు, సీఓఈ డాక్టర్ మునుస్వామి, అధ్యాపకులు బత్తిని నాగరాజు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఈకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, డాక్టర్ పి. సిద్ధేష్ గౌడ్, డాక్టర్ డి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి