Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 04:25 PM

ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్‌షాప్

ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్‌షాప్

ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్‌షాప్
09-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సలాడ్ తయారీపై అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. నేషనల్ గ్రీన్ కోర్ప్స్మా ర్గదర్శకాల మేరకు సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష మాట్లాడుతూ తాజా కూరగాయలు, పండ్లతో తయారుచేసే సలాడ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయని తెలిపారు. సలాడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవడతాయని విద్యార్థులకు సూచించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని అన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ పరంగి రవి, డాక్టర్ అంతటి శ్రీనివాసులు, సీఓఈ డాక్టర్ మునుస్వామి, అధ్యాపకులు బత్తిని నాగరాజు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఈకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, డాక్టర్ పి. సిద్ధేష్ గౌడ్, డాక్టర్ డి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్‌షాప్

Article Image

: నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సలాడ్ తయారీపై అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. నేషనల్ గ్రీన్ కోర్ప్స్మా ర్గదర్శకాల మేరకు సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష మాట్లాడుతూ తాజా కూరగాయలు, పండ్లతో తయారుచేసే సలాడ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయని తెలిపారు. సలాడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవడతాయని విద్యార్థులకు సూచించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని అన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ పరంగి రవి, డాక్టర్ అంతటి శ్రీనివాసులు, సీఓఈ డాక్టర్ మునుస్వామి, అధ్యాపకులు బత్తిని నాగరాజు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఈకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, డాక్టర్ పి. సిద్ధేష్ గౌడ్, డాక్టర్ డి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News