Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:21 PM

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
15-04-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. మునిస్వామి బుధవారం విడుదల చేశారు.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎం.ఏ తెలుగు, అర్థశాస్త్రం, ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, జంతుశాస్త్రం, ఎం.కామ్ కోర్సుల ఫలితాలను కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చన్నారు.

ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు గణనీయమైన ప్రతిభ కనబరిచారని, గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మెరుగుపడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోర్సులవారీగా ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది:

ఎం.ఏ తెలుగు – 84%

ఎం.ఏ అర్థశాస్త్రం – 100%

ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం – 18%

ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ – 68%

ఎమ్మెస్సీ జంతుశాస్త్రం – 84%

ఎం.కామ్ – 86%

ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు పది రోజులలోపు నిర్ణీత రుసుము చెల్లించి రీ-వాల్యుయేషన్ లేదా రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పూర్తి ఫలితాల కోసం కళాశాల వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పి. రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, పీజీ ఇన్‌చార్జీలు డా. వెల్దండి శ్రీధర్, డా. జ్యోత్స్న, డా. జె. నాగరాజు, వెంకట్ రమణ, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

Article Image

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. మునిస్వామి బుధవారం విడుదల చేశారు.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎం.ఏ తెలుగు, అర్థశాస్త్రం, ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, జంతుశాస్త్రం, ఎం.కామ్ కోర్సుల ఫలితాలను కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చన్నారు.

ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు గణనీయమైన ప్రతిభ కనబరిచారని, గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మెరుగుపడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోర్సులవారీగా ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది:

ఎం.ఏ తెలుగు – 84%

ఎం.ఏ అర్థశాస్త్రం – 100%

ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం – 18%

ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ – 68%

ఎమ్మెస్సీ జంతుశాస్త్రం – 84%

ఎం.కామ్ – 86%

ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు పది రోజులలోపు నిర్ణీత రుసుము చెల్లించి రీ-వాల్యుయేషన్ లేదా రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పూర్తి ఫలితాల కోసం కళాశాల వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పి. రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, పీజీ ఇన్‌చార్జీలు డా. వెల్దండి శ్రీధర్, డా. జ్యోత్స్న, డా. జె. నాగరాజు, వెంకట్ రమణ, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News