ఎన్జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
ఎన్జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
Editor Desk
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. మునిస్వామి బుధవారం విడుదల చేశారు.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎం.ఏ తెలుగు, అర్థశాస్త్రం, ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, జంతుశాస్త్రం, ఎం.కామ్ కోర్సుల ఫలితాలను కళాశాల అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చన్నారు.
ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు గణనీయమైన ప్రతిభ కనబరిచారని, గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మెరుగుపడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోర్సులవారీగా ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది:
ఎం.ఏ తెలుగు – 84%
ఎం.ఏ అర్థశాస్త్రం – 100%
ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం – 18%
ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ – 68%
ఎమ్మెస్సీ జంతుశాస్త్రం – 84%
ఎం.కామ్ – 86%
ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు పది రోజులలోపు నిర్ణీత రుసుము చెల్లించి రీ-వాల్యుయేషన్ లేదా రీ-కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పూర్తి ఫలితాల కోసం కళాశాల వెబ్సైట్ను సందర్శించవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పి. రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, పీజీ ఇన్చార్జీలు డా. వెల్దండి శ్రీధర్, డా. జ్యోత్స్న, డా. జె. నాగరాజు, వెంకట్ రమణ, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి