Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 05:48 PM

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
April 15, 2026 05:28 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. మునిస్వామి బుధవారం విడుదల చేశారు.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎం.ఏ తెలుగు, అర్థశాస్త్రం, ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, జంతుశాస్త్రం, ఎం.కామ్ కోర్సుల ఫలితాలను కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చన్నారు.

ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు గణనీయమైన ప్రతిభ కనబరిచారని, గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మెరుగుపడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోర్సులవారీగా ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది:

ఎం.ఏ తెలుగు – 84%

ఎం.ఏ అర్థశాస్త్రం – 100%

ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం – 18%

ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ – 68%

ఎమ్మెస్సీ జంతుశాస్త్రం – 84%

ఎం.కామ్ – 86%

ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు పది రోజులలోపు నిర్ణీత రుసుము చెల్లించి రీ-వాల్యుయేషన్ లేదా రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పూర్తి ఫలితాల కోసం కళాశాల వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పి. రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, పీజీ ఇన్‌చార్జీలు డా. వెల్దండి శ్రీధర్, డా. జ్యోత్స్న, డా. జె. నాగరాజు, వెంకట్ రమణ, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News