Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 02:37 PM

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
April 15, 2026 05:28 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. మునిస్వామి బుధవారం విడుదల చేశారు.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎం.ఏ తెలుగు, అర్థశాస్త్రం, ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, జంతుశాస్త్రం, ఎం.కామ్ కోర్సుల ఫలితాలను కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చన్నారు.

ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు గణనీయమైన ప్రతిభ కనబరిచారని, గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మెరుగుపడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోర్సులవారీగా ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది:

ఎం.ఏ తెలుగు – 84%

ఎం.ఏ అర్థశాస్త్రం – 100%

ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం – 18%

ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ – 68%

ఎమ్మెస్సీ జంతుశాస్త్రం – 84%

ఎం.కామ్ – 86%

ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు పది రోజులలోపు నిర్ణీత రుసుము చెల్లించి రీ-వాల్యుయేషన్ లేదా రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పూర్తి ఫలితాల కోసం కళాశాల వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పి. రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, పీజీ ఇన్‌చార్జీలు డా. వెల్దండి శ్రీధర్, డా. జ్యోత్స్న, డా. జె. నాగరాజు, వెంకట్ రమణ, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News