ఎన్ హెచ్ 65పై మట్టి కట్ట వద్దు.. ఫ్లైఓవర్ నిర్మించాలి
ఎన్ హెచ్ 65పై మట్టి కట్ట వద్దు.. ఫ్లైఓవర్ నిర్మించాలి
K.RAVI
ఎన్ హెచ్ఏఐ డైరెక్టర్కు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల వినతి
- మురుగునీటి సమస్య పరిష్కారానికి డ్రైనేజీ విస్తరణ చేపట్టాలి
జాతీయ రహదారి (NH 65)పై ప్రస్తుతం ప్రతిపాదించిన మట్టి కట్ట నిర్మాణాన్ని రద్దు చేసి, దానికి బదులుగా పిల్లర్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ప్రాంతీయ కార్యాలయంలో డైరెక్టర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మట్టి కట్ట వల్ల స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, వ్యాపార సముదాయాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక పద్ధతిలో పిల్లర్లతో కూడిన ఫ్లైఓవర్ నిర్మిస్తేనే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.రోడ్డు నిర్మాణంతో పాటు ఎన్హెచ్ 65 పక్కన ఉన్న డ్రైనేజీ విస్తీర్ణాన్ని పెంచాలని ఆయన అధికారులకు సూచించారు.
ఎమ్మార్వో ఆఫీస్ నుంచి ప్రారంభమై 12, 13వ వార్డుల మీదుగా వెళ్లే డ్రైనేజీ సమస్యపై అధికారులతో ప్రత్యక్షంగా చర్చించారు.వర్షాకాలంలో నిలిచిపోయే నీటి వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను వివరించి, డ్రైనేజీ పైపుల సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతల దామోదర్ రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, తాడూరి పరమేష్, గుండబోయిన వెంకటస్వామి, చెవగోని మహేష్, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్, క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి