ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.
ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.
Editor Desk
హైదరాబాద్ (జూబ్లీహిల్స్): భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలోని కొత్త కాలనీలో ఉన్న హైటెన్షన్ వైర్ లైన్ను మార్చాలని కోరారు.
అలాగే ఏంబావి గ్రామంలో మిగిలిన స్మశాన వాటిక సీసీ రోడ్డు, గ్రామంలోని ఇతర సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పలు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చుక్క స్వామి, సీనియర్ నాయకులు గుండాల సత్యనారాయణ గౌడ్, కొత్త సత్తయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు చుక్క సురేందర్, భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి వాసగొని సాయి కుమార్ గౌడ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి