Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:09 PM

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
13-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ యూనివర్సిటీలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్, యూనివర్సిటీ అధ్యక్షుడు సాగర్ల కరుణాకర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో వివిధ వర్గాలకు ఎంత నిధులు ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ‘ఫీజు ఫోర్’ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సుమారు రూ.7,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్ లేదని చెప్పే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు సుధీర్, అనుముల సురేష్, శివ, నరేష్, వినయ్, రవి, విష్ణు, విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

Article Image

నల్లగొండ:

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ యూనివర్సిటీలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్, యూనివర్సిటీ అధ్యక్షుడు సాగర్ల కరుణాకర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో వివిధ వర్గాలకు ఎంత నిధులు ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ‘ఫీజు ఫోర్’ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సుమారు రూ.7,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్ లేదని చెప్పే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు సుధీర్, అనుముల సురేష్, శివ, నరేష్, వినయ్, రవి, విష్ణు, విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News