Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:06 AM

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
March 13, 2026 11:59 AM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ యూనివర్సిటీలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్, యూనివర్సిటీ అధ్యక్షుడు సాగర్ల కరుణాకర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో వివిధ వర్గాలకు ఎంత నిధులు ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ‘ఫీజు ఫోర్’ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సుమారు రూ.7,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్ లేదని చెప్పే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు సుధీర్, అనుముల సురేష్, శివ, నరేష్, వినయ్, రవి, విష్ణు, విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News