Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 04:09 PM

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
March 13, 2026 11:59 AM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నల్లగొండ:

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ యూనివర్సిటీలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్, యూనివర్సిటీ అధ్యక్షుడు సాగర్ల కరుణాకర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో వివిధ వర్గాలకు ఎంత నిధులు ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ‘ఫీజు ఫోర్’ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సుమారు రూ.7,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్ లేదని చెప్పే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు సుధీర్, అనుముల సురేష్, శివ, నరేష్, వినయ్, రవి, విష్ణు, విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News