Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:14 AM

ఈనాం భూములపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆపాలి. పట్టాల కోసం తాసిల్దార్‌కు వినతి

ఈనాం భూములపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆపాలి. పట్టాల కోసం తాసిల్దార్‌కు వినతి

 ఈనాం భూములపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆపాలి. పట్టాల కోసం తాసిల్దార్‌కు వినతి
February 09, 2026 08:36 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కాకినాడ జిల్లా పత్తిపాడు మండల కేంద్రంలో చింతలూరు ఈనాం భూమి సమస్య పరిష్కారం చేసి సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రజా ప్రదర్శన ర్యాలీ మండల తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించినట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి కే జనార్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్, తెలియజేశారు.12న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మరియు 25 నఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు . కార్పొరేట్లకు అనుకూలంగా ఫాసిస్ట్ మోడీ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని విబి రాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను యధావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా నిలిపివేయాలని ,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను స్కీం వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ఆపాలని 12 గంటల పని దినాన్ని రద్దుచేసి ఎనిమిది గంటల పని దినాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు మాట్లాడారు .దేశ సంపదను అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్లకు అప్పచెప్పే విధంగా భవిష్యత్తులో పేదలు మరింత పేదలుగా మారి పొట్టకూటికోసం సుదూర ప్రాంతాలకు వలస పోయే విధంగా కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు తన విధానాలని ప్రజల మీద రుద్దుతున్నారని హరినాథ్ విమర్శించారు. కార్యక్రమంలోఏగుపాటి అర్జునరావు, మానుకొండ లచ్చ బాబు, జిల్లా కమిటీ సభ్యులు తాడి నాగేశ్వరరావు, రాజాల రత్నం ఈరటా నాగ సూర్య కుమారి, చిన్నం అర్జునుడు, బీరా దేవతయ్య, వరికూటి లోవమ్మా, బండి రత్నం తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News