Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:12 PM

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్
23-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు పట్టణంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్) హాస్టల్‌ను రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య, సెలవుల సమయంలో తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్నారా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందిస్తున్నారా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే స్నాక్స్ విషయంలోనూ వివరాలు సేకరించారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం విద్యార్థులకు టీషర్ట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారి, హాస్టల్ స్పెషల్ అధికారి రోజారాణి, ప్రిన్సిపల్ వెంకటమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

Article Image

ఆలేరు పట్టణంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్) హాస్టల్‌ను రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య, సెలవుల సమయంలో తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్నారా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందిస్తున్నారా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే స్నాక్స్ విషయంలోనూ వివరాలు సేకరించారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం విద్యార్థులకు టీషర్ట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారి, హాస్టల్ స్పెషల్ అధికారి రోజారాణి, ప్రిన్సిపల్ వెంకటమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News