Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:30 AM

విద్యార్థి అమరవీరుల ఆశయాలకు అంకితం

విద్యార్థి అమరవీరుల ఆశయాలకు అంకితం

విద్యార్థి అమరవీరుల ఆశయాలకు అంకితం
February 25, 2026 07:13 PM 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పి.ఎస్.యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

నల్గొండ, : ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (పి.ఎస్.యు) ప్రథమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమం మహేందర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మచ్చ వంశి, సహ కన్వీనర్ నల్లగంతుల అజయ్ మాట్లాడుతూ… విద్యారంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నడుమ ప్రగతిశీల ఆలోచనలతో గత ఏడాది ఫిబ్రవరి 25న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కలసి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్‌ను స్థాపించారని తెలిపారు.

సంఘం ఆవిర్భావం నుంచి విద్యా సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శాస్త్రీయ, సమాన విద్య కోసం గత యాభై ఏళ్లలో పోరాడి అమరులైన విద్యార్థుల ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తూ కామన్ స్కూల్ విధానం అమలు చేయాలని, విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ నియామకాలు చేపట్టి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.

కార్యక్రమంలో ఎస్. అనిల్ కుమార్, నిరంజన్, ఎస్. ప్రవీణ్, కె. మనీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News